ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : జిల్లా వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
77 Views

వికారాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలుకు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో జరిగిన జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆయాశాఖల ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు. అంతే విధంగా వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీ నారాయణ, మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ మంజుల రమేష్ , గ్రంథాలయం, జడ్పీ కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.