వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలి: మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

0
11 Views

వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మేజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఆర్ రుద్రమా సంస్థ ను ఆమె సందర్శించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మచ్చలేని నాయకుడు నరేంద్రమోడి అని కొనియాడారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ ను తీసుకు రావడం జరుగుతుందన్నారు. అదే విధంగా శాటిలైట్ నిధులను మళ్లీ వికారాబాద్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకం కింద ప్రతి నిరుద్యోగికి కేంద్రం శిక్షణ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వహకురాలు స్వాతి, నాయకులు రాజశేఖర్ , రాములు, తదితరులు పాల్గొన్నారు.