డాక్టర్ లేడని ఆసుపత్రికి మేక పిల్లను కట్టి నిరసన తెలిపిన గ్రామస్తులు .. వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన దృశ్యం

0
141 Views

వికారాబాద్: మూగ జీవాలకు వైద్యం  అందించేందుకు ఆసుపత్రి ఉన్నప్పటికి అందులో వైద్యుడు లేక పోవడంతో గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలోని పశువైద్య శాలకు ఏకంగా మేక పిల్లను కట్టి నిరసన తెలిపిన సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దశరథ్ అనే రైతు మేక పిల్ల అస్వస్థకు గురి కాగా వైద్యం కోసం ఎదురు చూసిన ఫలితం లేక పోవడంతో మేక పిల్ల మృతి చెందింది. దీంతో కోపానికి గురైన రైతు ఆ చనిపోయిన మేక పిల్లను గ్రామంలో ఉన్న పశువైద్య శాలకు కట్టి నిరసన తెలిపాడు. పశువులకు వైద్య అందక గ్రామంలో చాలా మేకలు పశువులు చనిపోతున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.