సుభాష్ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్..44 బైక్లు, ఒక ఆటో సీజ్

0
13 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుబాష్ నగర్ కాలనీలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కాలనీలో 200 ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీకులు సరైన పత్రాలు లేని 44 బైక్లను ఒక ఆటో సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించి వానానాలను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్డెన్ సర్చ్ ఒకడీఎస్పీ, ముగ్గురు సీఐలు 7 మంది ఎస్ఐలు, 5 మంది ఏఎస్ ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు ఈ కార్డెన్ సర్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ నర్సిములు మాట్లాడుతూ.. గంజాయికి దూరంగా ఉండాలని ఎవరైనా మీ పరిసరాల్లో అమ్మకాలు చేసిన కొనుగోలు చేసిన గంజాయిని ఉపయోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వ కూడదని, తప్పని సరిగా హెల్మెంట్ ధరించి వాహనం నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీను, ఆంజనేయులు, సీఐలు, ఎస్ ఐ పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.