ప్రముఖ సినీ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్రకి అరుదైన గౌరవం

0
10 Views

వికారాబాద్:ప్రముఖ సినీ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్రకి అరుదైన గౌరవం దక్కింది. శనివారం హైదరాబాద్ హోటల్ మ్యారీగొల్డ్ లో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సినీరంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకుగాను ఆయన ఈ డాక్టరేట్ అందుకున్నాడు.సహజ నటి జయసుధ, ప్రముఖ నటుడు మురళీమోహన్, నటుడు నరేష్, శివ బాలాజీ, నటి పవిత్ర లోకేష్, శ్రీ త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామిజీ, ఎం.ఎన్ రవి కుమార్, సి.హెచ్ వెంకటఫణి అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి పార్లమెంట్ సభ్యురాలు సుమలత అంబరీష్, డ్రమ్స్ కళాకారుడు శివమణి, టివి9 రజనీకాంత్, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తదితరులు గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.గతంలో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్, సినీ నటుడు నరేష్ తోపాటు అనేక మంది ప్రముఖులు గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.