మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన శుభప్రద్ పటేల్

0
195 Views

వికారాబాద్ : బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఎన్.శుభప్రద్ పటేల్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర, కిషోర్ గౌడ్ తో కలిసి ఆయన ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులుగా తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించామని వారు కేసీఆర్ దృష్టికి తీసుకు రాగా, ఆయన వారిని అభినందించారు. అనంతరం వారు రాష్ట్రంలో తాజా పరిస్థితులు పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు పూర్వవైభవం వచ్చేలా కష్టపడతామని వారు కేసీఆర్ కు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ తమకు భరోసా ఇచ్చారని వారు ఈ సందర్భంగా తెలిపారు.