దావత్ -ఈ -ఇఫ్తార్ లో పాల్గోన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
16 Views

వికారాబాద్:సోమవారం వికారాబాద్ లోని చిగుళ్ల పల్లి గ్రౌండ్స్ లో తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్  ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితగా వస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి అన్ని మండలాలు మరియు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొని తమ ఉపవాస దీక్షను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నవాబ్ మహమూద్ ఆలం ఖాన్, ముజాఇద్ ఆలం ఖాన్,మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అజమతుల్లా ఖాన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫహీం భాయ్, ఎంపీ రంజిత్ రెడ్డి, MLA లు రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్,వహీద్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ C.మంజుల రమేష్ ,అయూబ్ అన్సారీ, ముక్తార్ షరీఫ్,వెంకట్ రెడ్డి, పరుశరామ్ నాయక్,శ్రీనివాస్ ముదిరాజ్, రఘుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అసిఫ్, సర్ఫరాజ్, జాఫర్, కరీం, రహీం తదితరులు పాల్గొన్నారు