గ్రామాల్లో జరిగిన అభివృద్ది నరేంద్రమోడీదే : బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
19 Views

వికారాబాద్: గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ది కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిఅన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో పలువురు నాయకులు బీజేపీ పార్టీలో చేరడంతో వారికి కండువా వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్టాడుతూ. నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారన్నారు. రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు అన్ని మోడినే అందించారన్నారు. మోడీకి దేశంలో పోటీ లేదని ఆయన పోటీ ఎవరని ప్రశ్నించారు. అబద్దాలు నమ్మితే వీరే వారికి ఓట్లు వేయాలని, నిజాలు కావాలంటే మోడీకి ఓటు వేయాలని కోరారు. నేను స్థానికుడినని ఈ ప్రాంత అభివృద్ది లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఏం చేయలేదని అలాంటి వారికిఓట్లు వేయకూడదన్నారు. అంతే కాకుండా తనను గెలిపిస్తే వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తీసుకువస్తానని తెలిపారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్లు పనులు తాను తీసుకొచ్చినవేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు మాదవరెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, నాయకులు రాజేందర్ రెడ్డి, పోకల సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.