శేరిలింగంపల్లి లో భారీ గా గంజాయి పట్టివేత…

0
16 Views

అనంతగిరి డెస్క్:శేరిలింగంపల్లి లో 10 కేజీల గంజాయి సీజ్ చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు.సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా నుండి ఆంధ్ర మీదుగా హైదరాబాద్ కు గంజాయిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో స్మగ్లింగ్ చేస్తూ గంజాయి ని హైదరాబాద్ లో ఓ వ్యక్తి అప్పగించే ప్లాన్. ఒడిస్సా కు చెందిన రాహుల్ అనే యువకుడిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎక్సైజ్. గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్న విక్రమ్. పరారీ లో హైదరాబాద్ కు చెందిన విక్రమ్, ఒడిస్సా కు చెందిన జగన్నాథ్ బిస్వా. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు.