వికారాబాద్:విద్యాశాఖలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 21,000 ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్యలు త్వరగా పరిష్కరించాలని తెలంగాణ విద్య శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్ డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. , సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే తదుపరి కార్యాచరణపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చాడని ఆ హామిని నిలుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా
181 Views