పెళ్లి లో మటన్ పెట్టలేదని గొడవ

0
103 Views

అనంతగిరిడెస్క్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారనే కారణంగా వివాదం చెలరేగింది. ఈ వివాదం క్రమంలో, రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ హింసాత్మక సంఘటనతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది.ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.