22 Views
కోట్ పల్లి: కోట్ పల్లి మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి పూస్తే ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోచమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు తాళం విరగొట్టి అమ్మవారి బంగారు పూస్తే ఎత్తుక పోయారు. ఒకవైపు పోచమ్మ గుడిలో శివాలయంలో జరిగిన సంఘటనలకు ఇప్పటికీ బాధ్యులను ఎవరిని పట్టుకోలేరు ఆ సంఘటన మరువకముందే పోచమ్మ దేవాలయంలో మరొక సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని గ్రామస్తులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.