విలేకరులు పైన దాడి చేసిన JDH ప్రైవేటు పాఠశాల సిబ్బందిపై విద్య అధికారులు చర్య తీసుకోవాలి

0
22 Views

పరిగి: పరిగి పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాల JDH పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులచే పని చేపిస్తుంటే ఆ విషయం తెలుసుకొని విలేకరులు వెళ్లి జెడిహెచ్ పాఠశాల సిబ్బందికి అడగడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువుకోడానికి పంపిస్తున్నారు కానీ మీరు విద్యార్థులచే పని చేయించడం ఏంటి అని విలేకరులు ఆ పాఠశాల సిబ్బందికి అడగడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా విలేకరులు ఆ పాఠశాలలో విద్యార్థులు పని చేస్తుంటే ఫోటోలు వీడియోలు తీస్తున్న క్రమంలో ఆ పాఠశాల సిబ్బంది ఇష్టానుసారంగా విలేకరులపై దుష్ భాష ఆడుతూ విలేకరులపై దాడి చేయడం జరిగిందన్నారు. విలేకరులపై దాడి చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోకపోతే PDSU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.