ప్రతి రైతుకు షరతులు లేని రుణమాఫి చేయాలి: మర్పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

0
100 Views

మర్పల్లి: రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మర్పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ పిలుపుమేరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అందులో 40 శాతం మందికి కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం 6 గ్యారంటీలను కూడా సరిగ్గా అమలు చేయలేదని  కొద్దికాలంలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మధుకర్, పట్లూర్ మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.