బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రాస్ ద్వారా ఆర్థిక సాయం

0
90 Views

మర్పల్లి :  మర్పల్లి మండలంలోని కల్ కూడా గ్రామానికి చెందిన రాయచురి శైదాభి అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందింది.. అట్టి విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకుని ఎస్ కేఆర్ ట్రస్ట్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ఆమె అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించగా స్థానిక మాజీ సర్పంచ్ రాచన్న గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె సంజయ్, రాములు రషీద్, షఫీ, సంగమేష్, ఇస్మాయిల్, శివ, సజ్జద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు..