వికారాబాద్: వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుండి దాటే ప్రయత్నం ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జు అయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణ ఏన్నేపల్లికి చెందిన సయ్యద్ పాషా వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ కింద నుంచి దాటే క్రమంలో ఆ సమయంలో ఒక్క సారిగా గూడ్స్ ట్రైన్ కదులగా రైలు అతని ఒక కాలు మీది నుండి వెళ్లడంతో ఒక కాలు కింది భాగం నుజ్జునుజు అయింది.. గమనించి గాడ్ అప్పుడే సడన్ గా రైలు ఆపివేశారు. .. స్థానికుల సహాయంతో అతన్ని ట్రైన్ కింది నుంచి బయటికి తీసిన జి.ఆర్.పి పోలీసులు తీవ్ర గాయాలతో వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించారు.
ఇదిలా ఈ మధ్య కాలంలోనే డైట్ విద్యార్థి ఇలాగే గాయపడి ఒక కాలు పొగొట్టుకుంది . ఇప్పటికైనా అధికారులు పాద చారులు వెళ్లే విధంగా అక్కడ ఒక వంతెన ఏర్పాటు చేస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.