చేవెళ్ల భవిష్యత్తుకు నాది భరోసా :కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0

వికారాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. చేవెళ్లలోని యువతి యువకులకు ఉపాధి మార్గం చూపే బాధ్యత తనదన్నారు. గతంలో తన ఎంపీగా ఉన్న సమయంలో అనేక స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాములు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. మరోసారి తనని గెలిపించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు చేవెళ్ల ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. రానున్న రెండు వారాలు దేశంలోని యువతి యువకుల బంగారు భవిష్యత్తుకు అతి కీలకమని అన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడిన భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ చేపట్టిన పనులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ రాజకీయాల పేరిట ముస్లిం మైనార్టీలను విభజిస్తుందని వారి కుట్రలను చదువుకున్న విద్యార్థులు యువకులు, విజయవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన రాహుల్ గాంధీ యూపీలో పోటీ చేయలేక పారిపోయాడని ఏద్దేవా చేశారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు బీజేవైఎం సభ్యులు పాల్గొన్నారు.