బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతయి: చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

0

వికారాబాద్:బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మొహినాబాద్ లో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ. ఇదేవిషయాన్ని మొన్నటి సభలో సీఎం రెవంత్ మాట్లాడగానె బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందన్నారు.అందుకే యిప్పుడు మాట మార్చీ ఏదేదో మాట్లాడుతున్నారని గత ఐదేళ్ళ లో నా ఇంటికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆదరించానని తెలిపారు. ఇంత చాయి పోసి, బువ్వ పెట్టిన ప్రతీ ఒక్కరి కస్టం తెలుసుకుని, తీర్చటానికి ప్రయత్నించానన్నారు. ఐదేళ్ల నుంచి జనాన్ని పట్టించుకోని బీజేపీ అభ్యర్థి…ఇప్పుడోచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా, అందరినీ కలుస్తా అంటే ఎవరు నమ్ముతారన్నారు.
చేవెళ్ల లోక్ సభ పరిధిలో అందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయించే బాధ్యత నాదీని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ .500 కే గ్యాస్ సిలిండరు వస్తుందని అర్హులైన వారందరకీ 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు స్కీమ్ వర్తిస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికలు అయిపోయాక మేం ఎక్కడికీ పోమని ఈ గడ్డ మీదనే ఉంటామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం మళ్లీ మీ దగ్గరకే వస్తానని
మీలో ఎవరికైనా ఆరు గ్యారంటీలు అమలుకాకపోతే అప్పుడు అడగండని పేర్కొన్నారు ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు.