రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0

వికారాబాద్(ధారూర్): చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ధారూర్ మండల కేంద్రంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.
గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిలేదని, నరేంద్ర మోదీ నయవంచకుడని, మోడీ మాట విని బీజేపీకి ఓటు వస్తే మన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. నన్ను గెలిపించినట్లే కష్టపడి పనిచేసే రంజిత్ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ యాదవ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, ధారూర్ మండల అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముజాఫర్ , జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అయూబ్ అన్సారీ , మాజీ జెడ్పిటిసి రాములు , మాజీ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.