రంజిత్ రెడ్డి గెలిస్తే చేవెళ్ల పార్లమెంట్ లక్ష కోట్లుతో అభివృద్ది :కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

0

వికారాబాద్:చేవెళ్ల పార్లమెంట్ అభివృద్దికి లక్ష కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వికారాబాద్ నియోజకవర్గానికి సైతం 15వేల కోట్లు నిధులు మంజూరు చేస్తానని మాట ఇచ్చారని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ నియోజకవర్గం నుంచి మంచి మేజార్టీ ఇవ్వడం జరిగిందని ఈ సారి కూడా అదే విధంగా మేజార్టీ ఇద్దామన్నారు. బీజేపీ శ్రీ రాముడి పేరుతో రాజకీయం చేసే కుట్ర చేస్తుందని, రాముడు బీజేపీ నాయకులకే దేవుడు కాదని హిందువులందరికి దేవుడని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్తహార్ షరీప్, మల్లయ్య,మల్లిఖార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు