దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేయాలి: బీజేపీ జిల్లా నాయకులు రాజేెందర్ రెడ్డి

0

వికారాబాద్:దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపింతాలని బీజేపీ జిల్లా నాయకులు రాజేెందర్ రెడ్డి , బుస్సా శ్రీకాంత్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ , అంబేద్కర్ కాలని , అంబేద్కర్ కాలనీలో ఇంటింటికి తిరిగి బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి బీజేపీ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ఎవరూ తీసుకోని సాహసోపితమైన నిర్ణయాలను తీసుకున్నారని , ప్రపంచంలోనే దేశాన్ని ముందు వరుసలో ఉంచడం కోసం 24 గంటలకు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు .