అక్రమ బియ్యం తరలింపు ముఠా అరెస్ట్ : జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
8 Views

వికారాబాద్: అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న వారిని పట్టుకుని అసలు సూత్రదారులను గుర్తించడం జరిగిందని వారి నుండి 30 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురు నింధితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. గుపువారం మద్యాహ్నం పెద్దేముల్ మండలం మందానపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని బోలేరో వాహనంలో తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. వారి నుండి 30 క్వింటాళ్ల బియ్యంతో పాటు బోలేరో ఓనర్ ప్రేమ్ సింగ్ ను డ్రైవర్ సంతోష్ నార్సింగ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం చించోలి అని వీరిని విచారించగా జహీరాబాద్ మండలంలోని హోతి(కె) గ్రామానికి చెందిన జాకీర్ అలీని పేరు చెప్పారని అతడి వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇంక జాంగీర్ , వైద్యనాథ్ లు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఈ సందర్బంగా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్ , టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశం, పెద్దేముల్ ఎస్ ఐ తదితరులు పాల్గొన్నారు.