స్వరాష్ట్ర స్వపరిపాలనలో స్వచ్ఛ గ్రామాలకు శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
13 Views

వికారాబాద్(ధారూర్): స్వరాష్ట్ర స్వపరిపాలనలో స్వచ్ఛ గ్రామాలకు శ్రీకారమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామంలో పర్యటించారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి గౌరవ *కెసిఆర్* కల్పించిన సువర్ణవకాశంతో *అవుసుపల్లి* నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడి అభివృద్ధికి చేరువైందన్నారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలకు విద్యుత్ తీగలు వెంటనే ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా అందించాలని, గ్రామంలో మరియు పంటపొలాల్లో పలు చోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ… సేవలందించాలన్నారు. గ్రామంలో పశువుల డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని పశు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పాడబడ్డ ఇళ్ళు మరియు పిచ్చి మొక్కలు, పల్లె ప్రగతిలోని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరథ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ… ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువలు నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.