వికారాబాద్ (పరిగి ) : బీజేపీకి ఓటేయడం అంటే దేశాభివృద్ధికి ఓటేయడమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటేయడం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చని మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం దోమ మండలం నుంచి కుల్కచర్ల మండలంలోనికి ప్రవేశించింది. కుల్కచర్ల మండలంలోని బండయల్కచర్ల & సాల్వీడ్ గ్రామస్తులు ఈ యాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమలం పువ్వుకు ఓటేయమని అభ్యర్థించారు.