తొలి పూజ అందుకున్న ఇందిరానగర్ వినాయకుడు

0
336 Views

వికారాబాద్ : వినాయక చవితి సందర్బంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన అతిపెద్ద గణనాథుడైన ఇందిరానగర్ గణపయ్య తొలిపూజ అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరానగర్ కాలనీ పెద్ద శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా తొలి పూజ నిర్వహించగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించగా భక్తులు దైవ ప్రసాదం స్వీకరించారు . ఈ పూజ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొండల శ్రీనివాస్ , కాలనీ వాసులు రమేష్ , విజయ్ , శేఖర్ గౌడ్ , బొంజల శేఖర్ , బొండల మల్లేష్ , ప్రవీణ్ గౌడ్ , ప్రశాంత్ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు