ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు కోట్ పల్లి పాఠశాల విద్యార్థి, ఉపాధ్యాయుడికి ఆహ్వానం

0
934 Views

వికారాబాద్: ఢిల్లీలో జరగబోయే దేశ స్వాతంత్ర వేడుకలకు కోట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల   ఉపాధ్యాయుడు K. లక్ష్మం , అదే  పాఠశాల విద్యార్థి K. సాయి చరణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మహాసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా K. సాయి చరణ్ ప్రశంసా పత్రం అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపికలో కోట్పల్లి ZPHS విద్యార్థి ప్రావిణ్యం ప్రదర్శించడం గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఈ సందర్భంలో విద్యార్థి సాయి చరణ్ విజయాలకు తోడ్పడిన ఉపాధ్యాయుడు K. లక్ష్మం సేవలను ప్రధాని మోడీ ప్రత్యేకంగా  ప్రశంసించనున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉప్యాయుడు, విద్యార్థి నేడు హైదరాబాద్ నుండి విమానంలో ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.