రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

0
21 Views

వికారాబాద్: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం. శనివారం రాత్రి రైల్వే స్టేషన్ నుండి తాండూర్ వెళ్లే రైలు మార్గంలో ఎల్లమ్మ గుడి దాటాక ఓ వ్యక్తి సాయంత్రం 6 గంటల సమయంలో కాచిగూడ- వాడి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెందాడని స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించడం జరిగిందన్నారు . ఈ విషయమై వివరాలు సేకరించగా మృతుడు దౌల్తాబాద్ మండలంకు చెందిన జీపీ శ్రీను (19) గా గుర్తించామని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.