హైదరాబాద్: గుంటూరు కు చెందిన వైభవి(19 సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వైభవి రెండేళ్ల నుంచి సందీప్ను దూరంగా పెడుతున్న సందీప్ వేరు వేరు నంబర్ల నుంచి వైభవి కి కాల్ చేస్తుూవేదిస్తున్నాడు. సందీప్ వైభవి ను చంపేసి తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసేజ్లు పంపుతుండగా సందీప్ టార్చర్ ను భరించలేక మే నెలలో వైభవి ,తన సోదరుడు మరియు తల్లితో కలిసి మియాపూర్లోని ఆదిత్యనగర్లో లో ఉంటోంది. ఈ రోజు ఉదయం 1030గంటల ప్రాంతంలో మియపూర్ లోని వైభవి ఇంటికి వచ్చిన సందీప్….వైభవి తల్లి శోభతో గొడవపడి ఇద్దరి పై కత్తితో దాడి చేశాడు. తర్వాత సందీప్ గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాయాలపాలైన వైభవి తల్లి శోభాలను చికిత్స నిమిత్తం కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్న మియపూర్ పోలీసులు….
మాదాపుర్ డిసిపి శిల్పవల్లి పాయింట్స్..
బాదితులు రేపల్లె కు చేందిన వారని సందీప్ మరియు వైభవి ప్రేమించుకున్నారని డీఎస్పీ శిల్పవల్లితెలిపారు. వారి ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందన్నారు. వారి ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో పేద్దల సమక్షంలో విడిపోయారన్నారు. కొంత కాలంగా వారు హైదరాబాద్ హఫిజ్ పేట్ లోని అదీత్య నగర్ లో అన్నతో కలిసి నివాసం ఉంటున్నారని వైభవికి మరోకరితో వివాహం జరుగుతుందని తేలుసుకున్న సందీప్ హైదరాబాద్ కు రావడం జరిగిందన్నారు. ఉదయం వైభవి తల్లి శోభతో గోడవ పేట్టుకున్న సందీప్..ఈ క్రమంలో వారిపై కత్తితో దాడి చేశారన్నారు. అనంతరం సందీప్ కత్తితో గోంతు కోసుకోవడం జరిగింది.. వైభవి ఆమె తల్లి ప్రైవేటు హస్పిటల్ చికిత్స పొందుతున్నారని వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. సందింప్ పరిస్థితి విషమంగా ఉందని అతన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది