ఢిల్లీకి బయలు దేరి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0
22 Views

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటానికి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్  అబ్ కి బార్ కిసాన్ సర్కార్ కు దేశ వ్యాప్త మద్దతు లభిస్తుందన్నారు.  బిఆర్ఎస్ పార్టీ భారత దేశ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలకాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆకాంక్షించారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్  దేశ ప్రజల కోసం ముఖ్యంగా రైతాంగం కోసం బిఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో వెళ్ళటం శుభ పరిణామామం అన్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి డిమాండ్ వస్తుందని,ఇలాంటి పాలన బిఆర్ఎస్ తో సాధ్యమని అన్నారు.అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ కి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని అన్నారు.ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.