బీజేపీ పట్టణశాఖ ఆద్వర్యంలో మున్సిపల్ దర్బార్

0
155 Views

వికారాబాద్:గత 25 ఏళ్లుగా అనంతగిరిపల్లెలో సీసీ రోడ్లు వేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు, మరియు స్కూల్ బిల్డింగ్ లీకేజీలు వంటి సమస్యలను వెంటనే మున్సిపల్ కమిషనర్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి, చెంచుపల్లి, లక్ష్మీ నగర్ తండాలో మున్సిపల్ దర్బార్ కార్యక్రమం నిర్వహించి పోస్టర్ విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ప్రజల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం బీజేపీ టౌన్ అధ్యక్షులు నరోత్తం రెడ్డి 10వ వార్డ్ ఇంచార్జ్ పాండు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి మాట్లాడుతూ,లక్ష్మీ నగర్ తండాలో తాగునీరు కోసం వేసిన బోరు స్టార్టర్ కాలిపోయి ఆరు నెలలు అవుతుందన్నారు. ఈ సమస్యలతో పాటు ఇతర సమస్యలను కూడా బీజేపీ నాయకులు గుర్తించి వాటికి పరిష్కారం కోసం చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే శివరాజ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, పట్టణ ఇంచార్జ్ రాజేందర్ రెడ్డి, డాక్టర్ కొప్పుల రాజశేఖర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిరీష, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు