విశ్వ హిందూ పరిషత్ అనంతగిరి జిల్లా నూతన కమిటీ నియామకం

0
100 Views

వికారాబాద్ :ఆగష్టు 10 , 11 తేదీలలో కామారెడ్డి లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ ) ప్రాంత సమావేశాలలో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ సమావేశాలలో అనంతగిరి జిల్లాకు సంబంధించిన కీలక నియామకాలను ప్రకటించారు.ఈ సందర్భంగా, అనంతగిరి జిల్లా మాతృ శక్తి సంయోజికగా మ్యాడం లక్ష్మి నియమితులయ్యారు. అలాగే, జిల్లా దుర్గావాహిని సంయోజికగా జి. శ్రీదేవి , జిల్లా ఉపాధ్యక్షులుగా  దోమ శ్రీకాంత్ , స్వప్నప్రియా రెడ్డి నియమితులయ్యారు.జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్ గా వడ్ల శ్రీశైలం ని నియమించారు. దుర్గావాహిని సహ సంయోజికలుగా కట్ట మాధురి , కుమారి బర్మావత్ జమున ని నియమించారు.ఈ నియామకాలు జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణను మరింత శక్తివంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.