ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదు: బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
23 Views

వికారాబాద్: ప్రజలు రాష్ట్రం, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని మాజీ ఎంపీ బీజేపీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా  వికారాబాద్ మండలంతో పాటు ధారూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పేరుతో ప్రజలను చెంప దెబ్బలు కొట్టేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు రెండు పైసలు కూడా మాకు చేయలేకపోయారని  ఏదేవా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను మోసం చేశారని ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లిన తనను నిరుపేద వృద్ధులు ఎదురు వచ్చి పెన్షన్ పెంచలేదని వాపోతున్నట్లు తెలిపారు. అటు కరెంటు ఇటు నీళ్లు సమస్య రోజురోజుకూ పెరిగిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదన్న విశ్వేశ్వర్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ నిధులతో వికారాబాద్ జిల్లాలో గ్రామాలకు రోడ్లు వేయిస్తున్నానన్నారు. ధారూర్ మండల కేంద్రంతో పాటు మన్ననూరు సోమరం, పీలారం, రాళ్లచిత్తంపల్లి, గడ్డమీది గంగారం, నాగారం, మామిడి కలాన్ గ్రామాల్లో కొనసాగిన బిజెపి ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. గ్రామాల్లోని బిజెపి శ్రేణులతో పాటు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు పలికారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. యాత్రలో వికారాబాద్ జిల్లా బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.