14 Views
అనంతగిరి డెస్క్: తెలంగాణకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 5వ తేదీన రానున్నారు. వివిధ అభివృద్ది పనులు ప్రారంభించడంతో పాటు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కేెంద్రాల్లో ప్రధాని పర్యటించనున్నారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల ముందు మోడీ రాక రాష్ట్రంలోని బీజేపీ నాయకుల్లో ఉత్సాహం నిప్పనుంది . అయితే ముందుగా వికారాబాద్ లో మోడీ పర్యటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంగారెడ్డి ఆదిలాబాద్ కు మార్చినట్లుగా బీజేపీ నాయకులు తెలిపారు.