అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇచ్చామో అంతకు డబుల్ మెజార్టీ ఇచ్చి రంజిత్ రెడ్డి ని గెలిపించాలి:కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు సుధాకర్ రెడ్డి

0

వికారాబాద్:పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్రేపల్లి శివారెడ్డి పెట్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చామో అంతకు డబుల్ ఈ పార్లమెంటు ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలో నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటికీ ఏం చేయలేదన్నారు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అందుకోసం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్లు మురళి, వేణుగోపాల్ రెడ్డి,చిగుళ్ళపల్లి రమేష్,అనంత్ రెడ్డి, మల్లికార్జున గౌడ్, చాపల శ్రీనివాస్, ముత్తార్ షరీఫ్,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.