వికారాబాద్ కు రూ.500 కోట్లు మంజూరు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0

వికారాబాద్(మోమిన్ పేట): వికారాబాద్ నియోజకవర్గానికి రూ.500 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
మోమిన్ పేట్ మండలం కేంద్రంలోని
అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన రోడ్ షో నిర్వహించి ఏజేఆర్ గార్డెన్ లో ఎంపీ అభ్యర్థి రంజిత్  రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఇరువురు మాట్లాడుతూ. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింట ప్రచారం చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరయ్య ఆయన చెప్పారు. మహిళల సంక్షేమం కోసం పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రూపాయలు రుణమాఫీ, మిగిలిన అన్ని గ్యారెంటీలను హామీలను అమలు చేస్తామన్నారు. బిజెపి పార్టీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ రద్దు చేస్తారని అన్నారు.బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి దేశంలోని ప్రజలను మోసం చేసారు.. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.