ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కారించాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
199 Views

వికారాబాద్:ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కారించాలని,
ప్రజావాణి కి 71 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
సోమవారం కలెక్టరెట్ సమావేశం హాలు నందు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ద్వారా స్వీకరించిన
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 71 మంది ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 71 అర్జీలు రాగా భూ సమస్యలు 59, పింఛన్లు 02, ఇతరములు 10 వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, , ఆర్ డి ఓ వాసు చంద్ర, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.