సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం:పిఆర్ టియుటిఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కె. వి చంద్రశేఖర్

0
221 Views

వికారాబాద్:సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం అని PRTUTS వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కె. వి చంద్రశేఖర్ అన్నారు.వికారాబాద్ మండలం అత్వేల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తు అకాల మరణం చెందిన అనిల్ కుటుంబానికి PRTU TS సంఘ పక్షాన లక్ష రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  అనిల్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరలో వచ్చేవిధంగా చొరవ తీసుకుని చేయించే బాధ్యత తమదేనని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్  మాట్లాడుతూ అనిల్ మరణం PRTU TS సంఘానికి తీరని లోటని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ మండల శాఖ అధ్యక్షులు చక్రాల కేదార్ నాథ్ , ప్రధాన కార్యదర్శి పట్నం రాఘవేందర్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి బాబ్యానాయక్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వీర కాంత్, బంటారం అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కుల్కచర్ల ప్రధాన కార్యదర్శి బసవరాజు, ధారూర్ ప్రధాన కార్యదర్శి మాణిక్యం, మండల అసోషియేట్ అధ్యక్షులు సి. హెచ్. శ్రీనివాస్, రాష్ట్ర బాధ్యులు ఎ.రాజశేఖర్, జిల్లా బాధ్యులు కిష్టరెడ్డి, అశోక్, మహేందర్, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.