వికారాబాద్ లో ఫూలే విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి:రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

0
141 Views

వికారాబాద్:వికారాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు కు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్  కోరారు. కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలు అందరికీ తెలిసేలా విగ్రహం ఉండాలన్నారు. మహనీయులు చూపిన బాటలో అందరూ నడవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. అదేవిధంగా పలు బీసీ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు వికారాబాద్ లో పూలే విగ్రహం ఏర్పాటు కోరుతున్నారని తెలిపారు.ఈ విషయం పైవెంటనే సానుకూలంగా స్పందించిన కలెక్టర్ స్థల సేకరణకు అతి త్వరలో చర్యలు చేపట్టి స్థలం కేటాయిస్థానని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు.