వికారాబాద్ పట్టణంలో వీధిలైట్లు వెలగడం లేదని ఫిర్యాదులు రాకూడదు : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ 

0
211 Views

వికారాబాద్:వికారాబాద్ పట్టణంలో రాత్రి సమయంలో ఎక్కడ కూడా వీధిలైట్లు వెలగడం లేదనే ఫిర్యాదులు రాకుండా, వీధిలైట్లతో పట్టణంలో వెలుగులు విరజిమ్మేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్  మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఆలంపల్లి ప్రధాన రోడ్డులోని బిజేఆర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తాతో పాటు ఇతర ప్రధాన కూడలిలలో జరిగిన హై మాస్ట్ లైట్ల మరమ్మతు పనులను చైర్ పర్సన్  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ వారం 10 రోజులలో మరమ్మతు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ సిబ్బంది రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.