మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణ స్పీకర్

0
196 Views

అనంతగిరి డెస్క్: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. సోమవారం షిరిడి చేరుకున్న స్పీకర్ అక్కడి నుంచి జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వరం కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ అర్చకులు స్పీకర్ తో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఉదయం షిరిడి సాయినాధుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకొనున్నారు. స్పీకర్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సన్నిహితులు దైవ దర్శనం చేసుకున్నారు.