ఎదురెదురుగా బైక్ లు ఢీ..మహిళ మృతి

0
463 Views

వికారాబాద్ :తాగిన మైకంలో వేగంగా బైక్ నడుపడంతో ఎదురెదురుగా బైకులు ఢీ కొట్టగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ మునిసిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం … కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ వివాహం చేసుకొని నవాబుపేట మండలం పూలపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా కూలీ పనులు చేసుకుంటూ భార్య రూమ(32)తో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పూలపల్లి నుంచి వికారాబాద్ వస్తుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని ధన్నారం వెళ్లే స్మశాన వాటిక వద్ద వికారాబాద్ నుండి కోటాలగూడ వైపు వెళుతున్న శ్రీనివాస్ నాయక్ బైక్ వేగంగా ఢీ కొట్టింది. ప్రశాంత్ బైక్ తో పాటు పాతూరుకు చెందిన మరో వ్యక్తి బైక్ ను అదే సమయంలో ఢీ కొట్టడంతో ప్రశాంత్ భార్య రూప కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.