CMRF క్రింద రూ2.40 లక్షలు మంజూరు చేయించిన స్పీకర్

0
23 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలానికి చెందిన రేణుక దేవి గత కొంతకాలంగా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున CMRF క్రింద LOC కి దరఖాస్తు చేసుకోగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ తీసుకొని వారికి రూ.2,40,000 LOC ని మంజూరు చేయించి ఆ పత్రాన్ని వారి భర్త యాదగిరికి అందజేశారు. ఆర్థికంగా తమను ఆదుకున్నందుకు కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్త పరుస్తూ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు