ఆరోగ్యం, పరిశుభ్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : సిడిఏంఏ అడిషనల్ డెరైక్టర్ శ్యామ్సన్

0
80 Views

వికారాబాద్:విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిడిఏంఏ అడిషనల్ డెరైక్టర్ శ్యామ్సన్  అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం సిడిఏంఏ అడిషనల్ డెరైక్టర్ శ్యామ్సన్ తో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్  వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని… విద్యార్థుల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అలాగే కుక్కల బెడదపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు