పనులు నాణ్యతగా చేయాలి: డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ

0
177 Views

వికారాబాద్(బంట్వారం): చేసే ప్రతి పనిని నాణ్యతగా చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పేర్కొన్నారు. బుధవారం బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి బస్వాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించి స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు కాంపోస్ట్ షెడ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసే ప్రతి పనిని అంకితభావంతో పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు, గత ప్రభుత్వంలో చేసిన ఈ పనులు నేడు ఎంతో పచ్చదనాన్ని అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి పనులతోనే సమాజంలో ఉద్యోగస్తుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తో గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డిపిఓ జయసుధ డి ఎల్ పి ఓ సంధ్యారాణి ఎంపీడీవో రాములు ఎంపీ ఓ నాగరాజ్ ఏపీఎం సుధాకర్ పంచాయతీ కార్యదర్శులు స్వప్న అరుణ జ్యోతి తదితరులు ఉన్నారు.