జిల్లా స్థాయి భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తా చాటిన సంకల్ప్ విద్యాపీఠం విద్యార్థులు…..

0
11 Views

వికారాబాద్: ఇటీవల ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత శ్లోకాల పోటీలో వికారాబాద్ పట్టణంలోని సంకల్ప్ విద్యాపీఠం విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల చైర్మన్ ధనశెట్టి మళిగి , ప్రిన్సిపాల్ ప్రభాకర్ తెలిపారు. 7 వ తరగతికి చెందిన తిరుమల్ తనుశ్రీ కి మొదటి బహుమతిగా సైకిల్ ను, అదేవిధంగా 9 వ తరగతికి చెందిన భువన కృతి , 10 వ తరగతికి చెందిన ప్రణవి రెడ్డి, ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించారు. బహుమతులు పొందిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ ధనశెట్టి మళిగి , ప్రిన్సిపాల్ ప్రభాకర్ , ఉపాధ్యాయులు అభినందించారు.