బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన మూడు గంటలుగా ధర్నా

0
13 Views

వికారాబాద్: కోట్ పల్లి నుంచి వికారాబాద్ కు వెళ్లే అరకొర ఆ ర్టీసీ బస్సులతో పాఠశాలలకు కళాశాలలకు సరైన సమయానికి చేరుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.బస్సులు సరిపోవడం లేదని తరుతూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు వేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మైలార్ దేవరంపల్లి గ్రామంలో ఉదయం నుంచి విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు బస్సులను ఇక్కడి నుంచి కదులనిచ్చేది లేదని భీష్మించుకున్నారు. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను వారి తల్లిదండ్రులను సమూదాయించే ప్రయత్నం చేశారు.