మోడీని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

0
243 Views

అనంతగిరి డెస్క్: తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాద పూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఎంపీలు ప్రధానమంత్రి మోదీని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని కోరారు. ఈ సమావేశం తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు అభివృద్ధి ప్రాధాన్యతలను ప్రధానంగా పరిశీలించింది.