పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి:సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్

0
140 Views

వికారాబాద్:పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు.గురువారం పంచాయతీ కార్మికులు ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ మాట్లాడుతూ, పంచాయతీ కార్మికులు కనీస వేతనం రూ. 9500 ఇవ్వడంతో పాటు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వమూ పంచాయతీ కార్మికులను చిన్న చూపు చూస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల నాయకులు మరియు ఇతర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.