15 Views
అనంతగిరి డెస్క్: జయశంకర్ భూపాలపల్లి – మల్హర్రావు మండలం ఇప్పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (52) ఆటో నడుపుతూ, మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టగా, పంట చేతికందే సమయానికి దిగుబడి సరిగా రాలేదు. ఆటో నడవక ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక జీవితం మీద విరక్తి చెంది మనస్తాపంతో ఈనెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఈ 17న మృతి చెందాడు.