16 Views
అనంతగిరి డెస్క్ : రాజేందర్నగర్కు చెందిన బిస్వాల్ ప్రభాస్(19) చదువుకుంటూ, పార్ట్టైమ్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. మార్చి 14న జరిగిన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కి గురయ్యాడు. బిస్వాల్ ప్రభాస్ తల్లిదండ్రులు బ్రెయిన్ డెడ్కి గురైన తన కొడుకు అవయవాలు దానం చేయడానికి ముందుకు రావడంతో, కాంటినెంటల్ హాస్పిటల్స్ డాక్టర్స్ కాలేయ వ్యాధితో చివరి దశలో ఉన్న రోగికి కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.